జనం ముచ్చట, ఖమ్మం జిల్లా:
స్థానిక స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు,తొలుత పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య మహిళా ఉపాధ్యాయులతో కలిసి కేక్ కట్ చేసి,మిఠాయిలు పంచారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు ఉపన్యాస పోటీలు నిర్వహించారు. విద్యార్థులు రోల్ ఆఫ్ ఉమెన్ అనే అంశంపై ఉపన్యాస పోటీలలో పాల్గొన్నారు…..

మహిళా దినోత్సవంలో పాల్గొన్న పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య….
ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య మాట్లాడుతూ ఆకాశంలో సగభాగంగా ఉన్న మహిళలు రాజకీయ, సామాజిక, ఆర్థిక శక్తిగా ఎదగాలని కోరారు. మహిళల ప్రాధాన్యతను తెలియజేసేందుకు తమ పాఠశాలలో పోటీలు నిర్వహించి బహుమతులు అందించామని తెలిపారు. మహిళలు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య, ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు….

మహిళా దినోత్సవంలో పాల్గొన్న చిన్నారులు….
జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్:9703973456
