హైదరాబాద్ హైడ్రా కార్యాలయంలో హైడ్రా కమీషనర్ A.V రంగనాథ్ గారు “జనం ముచ్చట”డిజిటల్ న్యూస్ పేపర్ ఆవిష్కరించారు…

జనం ముచ్చట డిజిటల్ న్యూస్ పేపర్ ఆవిష్కతీస్తున్న హైడ్రా కమీషనర్ A.V రంగనాథ్ గారు….
ఈ సందర్భంగా రంగనాథ్ గారు మాట్లాడతూ సమాజంలో నాటికి పెరుగుతున్న,గంజాయి, డ్రగ్స్ వంటి సామాజిక రుగ్మతలపై ఎక్కుపెట్టిన బాణం జర్నలిజమని,ఆ రుగ్మతలను రూపుమాపడం కోసం నిత్యం ప్రజల్లో ముఖ్యంగా యువతలో చైతన్యం తీసుకురావడంలో జర్నలిస్టులు ముందుండాలని,ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలు ప్రభుత్వాల దృష్టికి తీసుకుని వచ్చి తద్వారా ప్రజలకు మేలు చేసే విలువలతో కూడిన జర్నలిజం,చేయాలని సూచించారు….

జనం ముచ్చట విలేకరి పత్తి శ్రీనివాస్ ను అభినందిస్తున్న రంగనాథ్ గారు…..
ఈ కార్యక్రమంలో అర్జేసీ విద్యా సంస్థల అధిపతి గుండాల కృష్ణ, సీనియర్ పాత్రికేయులు ఆవుల శ్రీనివాసరావు,నాగ శేషు,శెట్టి రజనీకాంత్, మున్నూరు కాపు ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర నాయకుడు రంగా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు….

రంగనాథ్ గారికి పుష్పగుచ్చం ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్న పత్తి శ్రీనివాస్…..
