తెలంగాణ/ఖమ్మం సిటీ:
ఈ రోజు మధ్యాహ్నం సూర్యాపేట జిల్లా పిల్లలమర్రి వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన
ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మహమ్మద్ జావిద్ పార్దివదేహాన్ని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సందర్శించి నివాళులు అర్పించారు,ఈ సందర్భంగా మాట్లాడుతూ జావీద్ మరణం తీరని లోటని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు.జావేద్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు….

జావేద్ మృతదేహానికి నివాళులు అర్పిస్తున్న మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్….
ఈ కార్యక్రమంలో BRS జిల్లా నాయకుడు అర్జేసి కృష్ణ, మాజీ సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్,పార్టీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు,కార్పొరేటర్ కర్నాటి కృష్ణ,బత్తుల మురళి తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు…..
జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్:9703973456
