Khammam City: Feb:6:2:2026
ఏదులాపురం మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేంద్ రెడ్డి దూకుడు పెంచారు,ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు 8,10,11,12 వార్డుల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు, సీపీఎం పార్టీ బలపరిచిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను బారి మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేసారు...…
మాజీ ఎమ్మెల్యే కందాలా ఉపేందర్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన BRS, వామ పక్ష కార్యకర్తలు....
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శ్రీ కందాళ ఉపేందర్ రెడ్డి
మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దొంగ 420 హామీలతో ప్రజలను నమ్మించి మోసం చేసి అధికారంలోకి వచ్చిందని,కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి రెండేండ్లు దాటినా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక పోయారని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు,అంతే కాకుండా గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ఇస్తామని హామీ ఇచ్చి పేద ప్రజలను మోసం చేశారనీ విమర్శలు చేశారు….
మాజీ ఎమ్మెల్యే కందాలా ఉపేందర్ రెడ్డి ప్రచార సభకు బారీగా హాజరైన కార్యకర్తలు...
బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతుల పక్షాన నిలిచిన గొప్ప నాయకుడు "కేసీఆర్" అని,రైతులకు రైతు బంధు,రైతుభరోసా పథకాలు ఇచ్చి రైతుకు అండగా నిలిచిన ఆపద్బాంధవుడు కేసీఆర్ అని పేర్కొన్నారు,ఓట్ల కోసం అధికార కాంగ్రెస్ పార్టీ వాళ్లు మీ దగ్గరకు వచ్చినపుడు గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన దొంగ హామీల గురించి నిలదీసి ప్రశ్నించాలని ఓటర్లను కోరారు..