Janam Muchata – Voice of the People | Telugu News Platformపేదరికాన్ని జయించి పరిశోధనా శిఖరానికి.. VIT-AP నుంచి డాక్టరేట్ సాధించిన… › e-Paper Clip Janam Muchata – Voice of the People | Telugu News Platform
Share: f 𝕏 in @
janammuchata.in 26 Aug 2026, 6:07 am
Date of Publish : 16 Aug 2026, 9:38 am  |  Posted by : PATHI SREENIVAS RAO
👁 311 💬 0
Latest News > Bhadradri Kothagudem > Hyderabad > Khammam > Mahabubabad > Politics > Telangana

పేదరికాన్ని జయించి పరిశోధనా శిఖరానికి.. VIT-AP నుంచి డాక్టరేట్ సాధించిన ఖమ్మం కుర్రాడు కంచపోగు నాగరాజు…

పేదరికాన్ని జయించి పరిశోధనా శిఖరానికి.. VIT-AP నుంచి డాక్టరేట్ సాధించిన ఖమ్మం కుర్రాడు కంచపోగు నాగరాజు…

ఖమ్మం (కల్లూరు): ఆర్థిక ఇబ్బందులు, సామాజిక ప్రతిబంధకాలు ఎదురైనా.. పట్టుదల, అంకితభావం ఉంటే సాధించలేనిదేమీ లేదని నిరూపించారు ఖమ్మం జిల్లాకు చెందిన కంచపోగు నాగరాజు.మారుమూల గ్రామం నుంచి వచ్చి ఉన్నత చదువుల్లో అత్యున్నత ఘనతను సొంతం చేసుకుంటూ, పిహెచ్‌డీ (Ph.D) పట్టాను సాధించి ఎందరో యువతకు స్ఫూర్తిగా నిలిచారు....

ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పోచారం గ్రామానికి చెందిన నాగరాజు చిన్నతనం నుంచే చదువుపై అమితమైన ఆసక్తిని ప్రదర్శించేవారు.కుటుంబ పేదరికం ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెనక్కి తగ్గకుండా తన పట్టుదలతో ఉన్నత విద్యను కొనసాగించారు. ప్రసిద్ధ విద్యాసంస్థ వీటీ-ఏపీ యూనివర్సిటీ (VIT-AP University) లో పరిశోధకుడిగా చేరి, గురువారం తన డాక్టరేట్ పట్టాను అందుకున్నారు.

ప్రస్తుత సమాజంలో మానసిక ఆరోగ్య సమస్యలు తీవ్రమౌతున్న వేళ, నాగరాజు ఎంచుకున్న పరిశోధనాంశం అందరి దృష్టినీ ఆకర్షించింది. “కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత హైబ్రిడ్ మోడళ్లను ఉపయోగించి డిప్రెషన్ వ్యాధిని గుర్తించడం” (Detecting Depression using AI-based Hybrid Models) అనే అంశంపై ఆయన లోతైన పరిశోధన చేశారు. ప్రముఖ ఆచార్యులు డాక్టర్ సచినందన్ మోహంతి మార్గదర్శకత్వంలో నాగరాజు ఈ పరిశోధనను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ AI మోడల్ ద్వారా డిప్రెషన్‌ను ముందస్తుగానే గుర్తించి, బాధితులకు సరైన వైద్యం అందించేందుకు తన పరిశోధన ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు...

కష్టపడి సాధించిన ఈ విజయంపై పలువురు ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రముఖులు నాగరాజును అభినందించారు. నాగిలిగొండ గ్రామ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు చాట్ల రాజశేఖర్, నాగరాజు పరిశోధనా మార్గదర్శకులు డాక్టర్ సచినందన్ మోహంతి ప్రత్యేకంగా పాల్గొని ఆయనకు శాలువా కప్పి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. "పేదరికాన్ని జయించి ఉన్నత విద్యా శిఖరాలను చేరుకోవడం ఖమ్మం జిల్లాకే కాక తెలుగు రాష్ట్రాలకే గర్వకారణం. నాగరాజు భవిష్యత్తులో మరిన్ని గొప్ప పరిశోధనలు చేసి సమాజానికి, సాంకేతిక రంగానికి విశేష సేవలు అందించాలి" అని ఆకాంక్షించారు. నాగరాజు విజయానికి సహకరించిన ఆయన కుటుంబ సభ్యులకు, విశ్వవిద్యాలయ అధ్యాపకులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.నాగరాజు సాధించిన ఈ డాక్టరేట్ కేవలం ఒక విద్యా అర్హత మాత్రమే కాకుండా, ప్రతికూల పరిస్థితులను జయించి లక్ష్యాన్ని ముద్దాడిన ఒక నిరుపేద విద్యార్థి ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచింది....